Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

Follow Udayam on Google
K Anuradha Sep 02, 2026 4:01 PM శ్రీకాకుళంGeneral
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి - Udayam
మండలం భగీరథపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. లావేరు మండలం తామాడ గ్రామానికి చెందిన సాడి ఈశ్వరరావు (48) బుధవారం పామ్ ఆయిల్ తోటలో గెలలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో తామాడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...