వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

