Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల పోరాటం చారిత్రాత్మక విజయం: సీపీఎం అభినందనలు

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 11:19 PM చిత్తూరురాజకీయాలు
విద్యార్థుల పోరాటం చారిత్రాత్మక విజయం: సీపీఎం అభినందనలు - Udayam
చిత్తూరు: విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటం చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని, ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ సీపీఎం చిత్తూరు జిల్లా కమిటీ అభినందనలు తెలియజేస్తున్నట్లు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించకుండా కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమాలను అణచివేసే ప్రయత్నాలను విరమించి, విద్యావ్యవస్థ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...