వార్తలకు తిరిగి వెళ్లండి
ఆగస్టు 6–15 సీపీఐ పాదయాత్ర

చిత్తూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 15 వరకు చేపట్టనున్న సీపీఐ పాదయాత్రను ప్రజలు విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. రామానాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరులో జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...