Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల భోజన బిల్లుల్లో అక్రమాల ఆరోపణలు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 10, 2026 12:15 PM ఆదిలాబాద్General
విద్యార్థుల భోజన బిల్లుల్లో అక్రమాల ఆరోపణలు - Udayam
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా, గురుకులాల్లో భోజన బిల్లుల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మెనూ ప్రకారం ఆహారం అందించకుండానే కొందరు బిల్లులు చేస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లు, సంబంధిత సిబ్బంది కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నెలకు రూ.10 కోట్లకు పైగా భోజన బిల్లులు నమోదవుతున్నా పర్యవేక్షణ కొరవడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...