వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ ఆరోపించారు.
కరీంనగర్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోతే పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

