వార్తలకు తిరిగి వెళ్లండి
వెంకన్నకు వెండి కిరీటం కానుక
రూప దేవి Jun 25, 2026 4:53 PM శ్రీకాకుళం 16 viewsabout 12 hours ago

ఆమదాలవలస శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సినీ నటుడు శరత్ బాబు సోదరుడు మధు దీక్షితులు, శైలజ దంపతులు వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించారు. సుమారు రూ.1.5 లక్షల విలువైన ఈ కిరీటాన్ని ఆలయ అర్చకుడు చైతన్య, అధికారి సంతోష్కు వారు అందజేశారు.
స్వామివారికి కిరీటాన్ని బహూకరించాలనే తమ సంకల్పం మేరకు ఈ కానుకను సమర్పించినట్లు ఈ సందర్భంగా మధు దీక్షితులు దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...