వార్తలకు తిరిగి వెళ్లండి
కూరగాయల ధరలకు రెక్కలు

నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. సాగు గణనీయంగా తగ్గడంతో ఏపీ, మహారాష్ట్ర, యూపీల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో టమాటా మినహా మిగిలిన అన్ని కూరగాయల ధరలు కిలోకు రూ.25 వరకు పెరిగాయి.
జిల్లాలో సాధారణంగా సాగయ్యే 2 వేల ఎకరాలకు గాను వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుతం కేవలం 500 ఎకరాల్లోనే కూరగాయలు సాగవుతున్నాయి. దీంతో వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
Comments
Loading comments...