వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రాణాలు కాపాడితే రూ.25 వేల ప్రోత్సాహకం

రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడితే కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల ప్రోత్సాహకం అందిస్తుందని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బాధితులకు లక్షన్నర రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుందని పేర్కొన్నారు.
అత్యవసర సమయంలో ప్రజలు మానవతా దృక్పథంతో స్పందించి, బాధితులను ఆసుపత్రికి తరలించాలని కోరారు. సమాచారం కోసం వెంటనే 100, 108 నంబర్లను సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...