వార్తలకు తిరిగి వెళ్లండి
డయాలసిస్ రోగులకు ఆధార్ కష్టాలు

డయాలసిస్ చికిత్సకు ఆధార్తో కూడిన ఓటీపీ ధ్రువీకరణను తప్పనిసరి చేయడంతో సిద్దిపేట జిల్లాలోని పలువురు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ నంబర్ అనుసంధానం లేకపోవడంతో సకాలంలో వైద్యం అందడం లేదని రోగులు వాపోతున్నారు.
వారానికి రెండు మూడు సార్లు అత్యవసరంగా డయాలసిస్ చేయించుకోవాల్సిన బాధితుల కోసం నిబంధనలను సడలించి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చికిత్స అందించాలని రోగుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Comments
Loading comments...