వార్తలకు తిరిగి వెళ్లండి
అన్నవరంలో వరుణ యాగం

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశాల మేరకు అన్నవరం ఆలయంలో వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని మూడు రోజుల పాటు ఈ యాగం చేపట్టనున్నారు. దీని తేదీలు ఖరారు చేసేందుకు ఆలయ ఈవో చక్రధరరావు వైదిక బృందంతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...