వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం నూజివీడు కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి పాల్పడ్డారన్న ఆరోపణలపై గన్నవరం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
కేసును విచారించిన రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే. శ్రావణి తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేశారు. వంశీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
Comments
Loading comments...

