వార్తలకు తిరిగి వెళ్లండి
రాజకీయాలుBreaking
వైసీపీ నుండి టిడిపిలోకి భారీ చేరికలు

చిత్తూరులో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సమక్షంలో వైకాపాకు చెందిన సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. 16, 17, 18, 19 వార్డులకు చెందిన అశోక్, వినోద్, రాజేష్, కార్తీక్ తదితరులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం చూసే భారీగా చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...