వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయానికి నిబంధనలకు విరుద్ధంగా స్థలం కేటాయించిన అప్పటి తహశీల్దార్ ఎం.ప్రభాకర్ రావుపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.
మహారాజపేటలోని ఎర్ర చెరువు భూమిని 2022లో నిబంధనలు అతిక్రమించి కేటాయించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దీనిపై 10 రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...

