Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా పైడితల్లమ్మ ఉత్సవాలు: కలెక్టర్

Follow Udayam on Google
B RAJESH Aug 28, 2026 8:30 PM విజయనగరంGeneral
వైభవంగా పైడితల్లమ్మ ఉత్సవాలు: కలెక్టర్ - Udayam
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్పీ దామోదర్తో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 25, 26వ తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. విఐపీ దర్శనాల సమయంలోనూ సాధారణ భక్తుల దర్శనాలు ఆగకుండా చూడాలన్నారు.

Comments

G
Loading comments...