వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఎన్ఆర్టీ గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ వాసుదేవరావు ముక్కెర్లను సింగపూర్లో ప్రవాసాంధ్రులు ఘనంగా సన్మానించారు. బూన్లే పార్కులో పాలవలస పీఎస్ఐ ట్రస్ట్ ప్రతినిధి బాబూరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
వాసుదేవరావు 21 ఏళ్లుగా గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు సేవలందిస్తున్నారని బాబూరావు తెలిపారు. సన్మానంపై వాసుదేవరావు ట్రస్ట్ సభ్యులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
