వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ బోడ్ల రమేశ్ ఆధ్వర్యంలో వనమహోత్సవం నిర్వహించారు. మున్నూరు కాపు సంఘ భవనం వద్ద మున్సిపల్ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటారు.
అనంతరం ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ తో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
Comments
Loading comments...

