వార్తలకు తిరిగి వెళ్లండి
సిరికొండ మండల ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద వాల్గోట్ శివారులోని త్రీ హిల్స్ అన్నపూర్ణేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, బీమా పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు రాకేష్, నరేష్, అనిల్, అశోక్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

