వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షంతో వాగు ఉద్ధృతంగా ప్రవహించి సునీల్కుమార్ నీటిలో చిక్కుకున్నారు. పుల్లలచెరువు-తెల్లగట్ల మధ్య సప్టా వద్ద వాగును దాటేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది.
సమాచారం అందుకున్న ఎస్ఐ బి. సాంబశివరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టి సునీల్కుమార్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
Comments
Loading comments...

