వార్తలకు తిరిగి వెళ్లండి

వాగ్దేవి కాలేజీలో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ‘గో గ్రీన్ గణేష్’ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు సహజ మట్టి గణేశ విగ్రహాలను వినియోగించాలని విద్యార్థులకు సూచించారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత ముందుండి పర్యావరణహిత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సంజీవ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

