వార్తలకు తిరిగి వెళ్లండి

మునిపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. తహశీల్దార్, వ్యవసాయ, వైద్య, విద్య, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారు.
ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. మండల ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

