Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
భరత్ తేజ Jul 27, 2026 1:43 PM వనపర్తిGeneral
రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాలను రైతులు వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ గోవర్ధన్ సాగర్ సూచించారు. పాన్‌గల్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళాలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం మినుములు, కందుల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు కార్యాలయానికి వచ్చి అవసరమైన విత్తనాలు పొందాలని తెలిపారు.

Comments

G
Loading comments...