వార్తలకు తిరిగి వెళ్లండి
ఇరాన్పై అమెరికా ఏడు గంటల దాడులు

ఇరాన్పై తాము ఏడు గంటల పాటు ఏకధాటిగా దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన ఈ దాడుల్లో భాగంగా హర్మూజ్ జలసంధి, ఇరాన్ తీరప్రాంతాల సమీపంలోని సైనిక లక్ష్యాలను విజయవంతంగా ఢీకొట్టినట్లు స్పష్టం చేసింది.
తాజా విడత దాడులు ప్రస్తుతానికి ముగిశాయని యూఎస్ ప్రకటించింది. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘోర ఘర్షణలతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.
Comments
Loading comments...