వార్తలకు తిరిగి వెళ్లండి
అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి మేనన్

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి అనిల్ మేనన్ తొలిసారిగా రోదసిలోకి పయనమయ్యారు. రష్యాకు చెందిన సోయజ్ ఎంఎస్-29 వ్యోమనౌక ద్వారా రష్యన్ వ్యోమగాములతో కలిసి కజకిస్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బయలుదేరారు.
వీరు ఐఎస్ఎస్లో 8 నెలల పాటు ఉండి పలు పరిశోధనలు నిర్వహించనున్నారు. నాసా అధిపతి జేర్డ్ ఇజాక్మన్, అనిల్ మేనన్ భార్య అన్నా విల్హెమ్ (వ్యోమగామి) కాస్మోడ్రోమ్ వద్ద వారికి వీడ్కోలు పలికారు.
Comments
Loading comments...