వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ మండల కేంద్రంలోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి.
పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పందులు లోనికి వచ్చి మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల సమయంలో పందుల సంచారంతో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

