వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లిలో అకాల వర్షంతో వరి నాటు పూర్తిగా కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు. వర్షపు ఉద్ధృతికి పొలాల్లో మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు చేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు, రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

