వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి బండారు నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ యూనిఫామ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, ఇతర వసతులు కల్పిస్తున్నామని ఖీమ్యా నాయక్ తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

