వార్తలకు తిరిగి వెళ్లండి
లింగాపురం వద్ద గుర్తుతెలియని యువతి మృతదేహం

లింగాపురం వద్ద ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. అమరావతి రోడ్డులోని ఈ ప్రాంతంలో యువతిని హత్య చేసి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న సీఐ అచ్చయ్య మృతదేహాన్ని పరిశీలించగా, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తోంది. మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...