వార్తలకు తిరిగి వెళ్లండి
కల్లూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

పాణ్యం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు రూ. 17,98,047 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సోమవారం కల్లూరులో పంపిణీ చేశారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ. 8 లక్షలు, కే. భూపాల్ ఆచారికి రూ. 6,36,340, సులోచనమ్మ కుటుంబానికి రూ. 3,61,707 చొప్పున ఆమె అందజేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ఈ నిధులు అండగా నిలుస్తాయని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...