వార్తలకు తిరిగి వెళ్లండి
టూరిజంలో సర్కార్ నయా ప్రయోగం

ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘బీచ్ షాక్స్’ కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమేనని రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు వినోదం, ఆహ్లాదం పంచడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టామని, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఫలితాలను విశ్లేషించాక, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే దీనిని కొనసాగించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
Comments
Loading comments...