వార్తలకు తిరిగి వెళ్లండి
కోడుమూరు ఆసుపత్రిలో క్షేమంగా 4 కిలోల శిశువు జననం

కోడుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గీత అనే మహిళ సోమవారం సాధారణ ప్రసవం ద్వారా 4 కిలోల బరువున్న ఆడశిశువుకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యాధికారి డాక్టర్ బి. నాగరాజు తెలిపారు.
ఇటీవల లింగాలపల్లికి చెందిన లలిత కూడా ఇదే ఆసుపత్రిలో 4 కిలోల మగశిశువుకు సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చారని ఆయన వెల్లడించారు. సాధారణ ప్రసవాల కోసం వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషిని కుటుంబ సభ్యులు అభినందించారు.
Comments
Loading comments...