వార్తలకు తిరిగి వెళ్లండి
దిల్సుఖ్నగర్లో నిరుద్యోగుల ఉద్రిక్తత.
తెలంగాణలో కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న 19 వేల పోస్టులను భర్తీ చేయాలంటూ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Comments
Loading comments...