Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగాండా టూరు రాజు ఓయో అకాల మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:13 AM జాతీయంGeneral
ఉగాండా టూరు రాజు ఓయో అకాల మృతి - Udayam
ఉగాండాలోని టూరు తెగ రాజు ఓయో నింబా 34 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన మృతి వార్తను ఉగాండా ప్రధాని కాల్విన్‌ రోమిరీ అకీకీ ప్రకటించారు. తండ్రి మరణంతో ఓయో 1995లో మూడేళ్ల వయసులోనే రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. అవివాహితుడిగానే మరణించిన ఓయో వారసురాలిగా ఒకరిని నియమించినట్లు ప్రధాని తెలిపారు. ఆమె ఎవరన్నది టూరు రాజ్య సంప్రదాయాల ప్రకారం తగిన సమయంలో ప్రకటిస్తామన్నారు.

Comments

G
Loading comments...