వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. దత్తిరాజేరు మండలం ఎస్.బూర్జివలస పోలీస్ స్టేషన్ పరిధిలోని షికారు గంజి జంక్షన్ వద్ద జాతీయ రహదారి-26పై ఆటోను లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మానాపురం నుంచి రాంభద్రపురం వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

