వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్ పెన్షన్ దారులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని పెన్షనర్ల అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం బొబ్బిలి RDO కార్యాలయం వద్ద ఈపీఎఫ్ పెన్షన్ దారులు సమస్యలపై ధర్నా నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ కనీస పెన్షన్ రూ.9వేలు ఇవ్వాలని, రైల్వే ప్రయాణంలో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పడించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు.
Comments
Loading comments...

