వార్తలకు తిరిగి వెళ్లండి
విషజ్వరాలతో ఇద్దరు చిన్నారులు మృతి

జగిత్యాల జిల్లా పొరండ్లలో విషజ్వరాలు కలకలం రేపాయి. రెండు రోజుల వ్యవధిలో ఒకే తరగతి చదువుతూ పక్కపక్కనే నివాసముండే ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
హరిస్మిత, వరుణ్ తేజ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామంలో సుమారు 20 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...