వార్తలకు తిరిగి వెళ్లండి

తుని పట్టణంలో డీ మార్ట్ సమీపంలో తెల్లవారుజామును 2:30 గంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఒడిశా నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఘటన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో 40 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

