వార్తలకు తిరిగి వెళ్లండి
తుంగభద్ర డ్యామ్కు పెరిగిన వరద

ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం గణనీయంగా పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయానికి 10,938 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది.
ప్రస్తుతం డ్యాంలో 26.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసం వివిధ కాల్వలకు 3,184 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...