వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు 40,705 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 44.19 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
తాగునీటి అవసరాల కోసం 1,390 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు కొనసాగుతుండటంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

