Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు

Follow Udayam on Google
p.g.murthy Sep 08, 2026 11:13 AM మంచిర్యాలGeneral
ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా చర్యలు - Udayam
జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా పంచాయతీ అధికారులు మార్కింగ్ ఏర్పాటు చేశారు. జన్నారంలో ప్రతి మంగళవారం వారసంత జరుగుతుంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఈవో రాహుల్ ఆధ్వర్యంలో సిబ్బంది, కార్మికులు రోడ్డుకు ఇరువైపులా వ్యాపారుల కోసం సిమెంట్ మార్కింగ్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారు.

Comments

G
Loading comments...