వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం నియోజకవర్గంలోని జామి మండలం మోకాస కొత్తవలస గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిని అభినందించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అప్పలనరసయ్య సూచించారు. కార్యక్రమంలో పలువురు పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

