వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో TTD కస్టమర్ కేర్ ప్రతినిధులమంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను మోసం చేసి రూ.97,772 కాజేశారు. షేక్పేటకు చెందిన ఎరుకల లక్ష్మితో ‘ఓమ్ని కార్డ్ యూపీఐ’ యాప్ను ఇన్స్టాల్ చేయించారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. మోసాన్ని గుర్తించిన బాధితురాలు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

