వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రాలీ వాహనం బోల్తా

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ట్రాలీ వాహనం టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన చీమల అంజయ్య(50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడగా, వారిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...