వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదర్శ గ్రామాలే లక్ష్యం

గ్రామ పంచాయతీలను సమగ్ర అభివృద్ధి ప్రణాళికలతో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ ఏ. భాస్కరరావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంతోనే ఆర్థిక స్వావలంబన సాధ్యమని స్పష్టం చేశారు.
16వ ఆర్థిక సంఘం నిధులను పారదర్శకంగా వినియోగించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...