వార్తలకు తిరిగి వెళ్లండి
మహాకాళి ఆలయంలో చోరీ

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంలోని మహాకాళి అమ్మవారి ఆలయంలో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీని పగులగొట్టి దాదాపు రూ. లక్ష నగదును, సాక్ష్యాలు దొరక్కుండా సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను ఎత్తుకెళ్లారు.
శుక్రవారం ఉదయం ఆలయ పూజారి విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...