వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సంఘాల పిలుపుతో శనివారం మన్యం బంద్ ప్రభావం కనిపించింది. వాణిజ్య సముదాయాలు మూతపడగా, ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా మద్దతు తెలపడంతో ఆటోలు నిలిచిపోయాయి.
ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. జీవో నం.3 పునరుద్ధరణ, షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ డిమాండ్లతో బంద్ నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం తమ డిమాండ్లపై ప్రకటన చేయాలని నాయకులు కోరారు.
Comments
Loading comments...

