వార్తలకు తిరిగి వెళ్లండి
వైద్యం అందక గిరిజన విద్యార్థిని మృతి

బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడేనికి చెందిన గిరిజన విద్యార్థిని నందిత (12) మలేరియాతో శుక్రవారం మృతి చెందింది. కామయ్యకుంట ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఈమె, ఈ నెల 19న జ్వరంతో అస్వస్థతకు గురైంది.
వివిధ ఆసుపత్రుల్లో వైద్యం అందించినా ప్లేట్లెట్స్ పడిపోవడంతో కొయ్యలగూడెం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. టైఫాయిడ్, మెదడు సంబంధిత మలేరియా సోకినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...