వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సిటీ బస్సులు, ఆటోలపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అపసవ్యంగా పార్కింగ్ చేసిన 12 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1.20 లక్షల జరిమానా విధించారు.
బస్సులు, ఆటోలను రవాణా శాఖ కార్యాలయానికి తరలించి యాజమాన్యాలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...
