వార్తలకు తిరిగి వెళ్లండి
పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం
అనురూప్ గౌడ్ Jun 25, 2026 8:49 AM ఖమ్మం 10 viewsabout 20 hours ago

జూన్ 25 నుండి జులై 24 వరకు జరిగే ఇంటింటా ఓటరు సర్వేలో అర్హులందరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఆయన సర్వేను ప్రారంభించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. బీఎల్వోలు, సూపర్వైజర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...