Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టుకు హాజరుకాని విద్యాశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం

పార్వతి దేవి Jun 26, 2026 4:50 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago
కోర్టుకు హాజరుకాని విద్యాశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం - Udayam Digital
కారుణ్య నియామకాల ఉత్తర్వులను అమలు చేయని కేసులో కోర్టుకు హాజరుకాని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోర్టును నిర్లక్ష్యం చేయడం సరికాదని మందలించింది. తదనంతరం వర్చువల్‌గా హాజరైన కార్యదర్శి బేషరతుగా క్షమాపణలు కోరారు. తక్షణమే కోర్టు ఆదేశాలను అమలు చేసి, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును మూడు వారాలకు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...